Description
పానుగంటివారు సాక్షివ్యాసాలకు ఒక ఆదర్శం ఏర్పరచుకున్నారు. వ్యక్తి విమర్శ చేయకూడదు, తత్త్వవిమర్శ
మాత్రమే చేయాలన్నది ఆ ఆదర్శం. దోషాన్ని విమర్శించాలే తప్ప ఆదోషం చేసిన వ్యక్తిని కాదన్నమాట. దీనివల్ల వ్యక్తి, జాతి విరోధాలుప్పతిల్లవు. దోషాలు, నేరాలపట్ల వ్యక్తులకు ఏవగింపు కలుగుతుంది. వాటికి పాల్పడకుండా ఉంటారు. ఇదీ ఆశయం. ఈ రచయిత ప్రభుత్వానికి వ్యతిరేకికాదు. అతనికి రాజకీయాలు లేవు. అందువల్ల సాక్షి రాజకీయాలను విమర్శించలేదు. మత, ఆరోగ్య విషయాలు, సంఘ దురాచారాలు, చరిత్ర, సాహిత్యం మొదలైన విషయాలకు సంబంధించి ఇదీ అదీ అనక సమాజంలో కనిపించిన ప్రతి చెడునూ తూర్పార పట్టింది.
Send Your Messages Only 




































