Periya Puranam Telugu

– Sri Duggirala Gopala Krishna Murthy

నవరస భరితం నాయనార్ల చరితం

పెరియ పురాణం

– దుగ్గిరాల గోపాలకృష్ణ మూర్తి 

 

450.00

Share Now

Description

నాయనార్లు శివభక్తులు
 
నయనార్లు క్రీ.శ 5, 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.
 
ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
చరిత్ర
క్రీ.శ.4,5 శతాబ్దములవరకున్ను దేశములో బౌద్ధ, జైన మతములు సుస్థిరపడినవి. వాటిమూలమున వైదికమతమునకు గొప్ప దెబ్బ తగిలినది. జైన బౌద్ధములకు పూర్వము తమిళదేశములో నుండిన మతములెట్టివో తెలియదుకాని, ఉత్తరమునుంచి బ్రాహ్మణులు వలసవచ్చిననాటినుంచిన్ని వాటిని వైదికమతముతో సంబదించినవాటిగా మార్చడానికి ప్రయత్నించి ఉంటారు. ఈ ఉత్తరవైదికమతముకున్ను, దక్షిణాత్యమతములుకున్ను కలిగిన సమ్మేళనము వలన క్రొత్త సంప్రదాయము లీ ప్రాంతములలో ఏర్పడినవి. ఇవియే తమిళశైవ సంప్రదాయము, తమిళవైష్ణవసంప్రదాయము అనేవి. తమిళశైవ సంప్రదాయము నాయనార్ల మూలమునను, తమిళవైష్ణవ సంప్రదాయము ఆళ్వార్ల మూలమును వ్యాప్తిచెందినవి.