Description
కళాపూర్ణోదయము
పింగళి సూరన రచించిన తెలుగు కావ్యంకళాపూర్ణోదయము.ఇది తెలుగు భాషలో వచ్చిన మొదటి పద్య కావ్యమైన నవల.
కళాపూర్ణోదయం అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచించిన తెలుగు కావ్యం.
చరిత్ర రచనలో
కళాపూర్ణోదయం ప్రబంధం యొక్క కథావస్తువు రచన కాలం నాటిది కాకున్నా రచనలో అప్పటి స్థితిగతులు ప్రతిబించింది. యుద్ధానికి పోతున్న సైన్యం వర్ణన ఇందులో దొరుకుతోంది. సైన్యంతో పాటు కళాకారులు, కవులు, పండితులు, వారకాంతలు, కుటుంబం వంటి జనాన్ని తీసుకుపోయేవారు. ఇందరు వెళ్తుండడంతో ఆ సైన్యం వెళ్ళే ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకుని అక్కడ వ్యాపారస్తులు గుడారాలు వేసుకుని అమ్మేవారు. అలా యుద్ధానికి వెళ్తుంటే భాగ్యవంతులు తమ ఇళ్ళలో అనుభవించే అన్ని రకాల సౌఖ్యాలు కూడా అనుభవించేవారు. ఇలా సైన్యం వెళ్తుంటే ఓ నగరమే తరలివెళ్తోందా అనిపించిస్తోందన్న వివరాలు కళాపూర్ణోదయంలో ఉన్నాయి. విజయనగరాన్ని రాయల కాలంలోనూ, ఆయన అనంతరమూ చూసిన యాత్రాచరిత్రకారుడు న్యూనిజ్ వ్రాసిపెట్టిన రచనలో కూడా ఇదే విధమైన వర్ణన ఉంది.