Description
ఏకనాథుడి జీవించిన కాలం కచ్చితంగా తెలియదు. ఆయన 16వ శతాబ్దం చివరిలో జీవించినట్లు పండితులు అంచనా వేస్తున్నారు. పురాణాల ప్రకారం ఈయన మహారాష్ట్ర లోని పైఠాన్ అనే ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు అతను చిన్నతనంలో ఉండగానే మరణించారు. అతని తాత, వార్కరీ సాంప్రదాయంలో ముఖ్యుడు అయిన భానుదాస్ ఇతన్ని పెంచి పెద్దచేశాడు. మరి కొన్ని ఆధారల ప్రకారం భాను దాస్ అతని ముత్తాత అయి ఉండవచ్చు. అతని గురువైన జనార్ధన్ స్వామి ఒక సూఫీ సన్యాసి అయిఉండవచ్చని కొంతమంది పండితులు భావించారు.
రచనలు
ఏకనాథుడు భాగవత పురాణాన్ని ఏకనాథ భాగవతం పేరుతో తిరగరాశాడు. అలాగే రామాయణాన్ని కూడా భావార్థ రామాయణం అనే పేరుతో తిరగరాశాడు. ఇంకా రుక్మిణీ స్వయంవరం, శంకరాచార్యుడు సంస్కృతంలో రాసిన 14 శ్లోకాల హస్తామలకం అనే రచనను 764 పద్యాలతో తిరగరాశాడు.