Astadasa Puranalu Book at low price online | puranalu | devullu.com |

Showing 1–12 of 18 results

  • Brahma Vaivarta Puranam in telugu

    750.00

    బ్రహ్మ వైవర్త పురాణం

        బ్రహ్మ వైవర్త పురాణం ఓ సంస్కృత ఉద్గ్రంథం. హిందూ మతానికి చెందిన ప్రధాన పురాణం. ఇది కృష్ణుడు రాధల గురించిన వైష్ణవ గ్రంథం. ఆధునిక యుగ పురాణాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు.
     
           1 వ సహస్రాబ్ది చివరలో ఈ పురాణం యొక్క ఒక కూర్పు ఉనికిలో ఉన్నప్పటికీ, దాని ప్రస్తుత కూర్పు మాత్రం 15 లేదా 16 వ శతాబ్దంలో బెంగాల్ ప్రాంతంలో రచించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ పేరుతో పోలి ఉండే బ్రహ్మకైవర్త పురాణం అనే శీర్షికతో మరొక వచనం కూడా ఉంది. అది దీనికి సంబంధించినదే. దీన్ని దక్షిణ భారతదేశంలో రచించారు. ఈ పురాణం 274 లేదా 276 అధ్యాయాలలో, అనేక కూర్పులు ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మవైవర్త పురాణం లేదా బ్రహ్మకైవర్త పురాణం లోని భాగమేనని చెప్పుకుంటారు.
     
        కృష్ణుడిని సర్వోన్నత వాస్తవికతగా గుర్తించడం, విష్ణు, శివుడు, బ్రహ్మ, గణేశుడు వంటి దేవతలందరూ ఒకటేనని, అందరూ కృష్ణుడి అవతారాలేననీ ఈ పురాణం వక్కాణిస్తుంది. అలాగే రాధ, దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి వంటి దేవతలందరూ కూడా ఒక్కరేననీ, అందరూ ప్రకృతి అవతారాలేననీ కూడా చెబుతుంది. ఈ పురాణం స్త్రీకి ఉన్నత స్థానం కలిప్స్తుంది. మహిళలందరూ దివ్య స్త్రీ మూర్తి రూపాలేనని, విశ్వానికి సహ సృష్టికర్త అనీ, స్త్రీకి జరిగే అవమానం దేవత రాధకు జరిగినట్లేననీ ఈ పురాణం వచిస్తుంది.
     
    భాగవత పురాణంతో పాటు బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ-సంబంధిత హిందూ సంప్రదాయాలపైన, అలాగే రాసలీల వంటి నృత్య ప్రదర్శన కళలపై కూడా ప్రభావం చూపాయి
  • Garuda Puranam Telugu

    799.00

    గరుడ పురాణం
    764 pages

  • Markandeya Puranam in telugu

    349.00

    మార్కండేయ పురాణం

  • Sri Agni Puranam in Telugu

    799.00

    శ్రీ అగ్ని పురాణం

    28.9.21 Release

  • Sri Bhavishya Mahapuranamu

    450.00

    శ్రీ భవిష్య పురాణము

         సంస్కృతంలో వ్రాసిన హిందూ మతము యొక్క పురాణ శైలిలో రచించిన పద్దెనిమిది ప్రధాన రచనల్లో భవిష్య పురాణము (భవిష్య పురాణం) ఒకటి. భవిష్య అంటే “భవిష్యత్తు” అర్ధం. ఇందులో భవిష్యత్ గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, ఇది మనుగడలో ఉన్న లిఖిత ప్రతుల యొక్క “ప్రవచనం” భాగాలు కలిగి ఉన్న ఒక ఆధునిక శకం పని. ప్రాచీన కాలంగా ఉంటున్న, మనుగడలో ఉన్న లిఖిత గ్రంథాల్లోని ఇందులోని కొన్ని విభాగాలు, బృహత్ సంహిత, సాంబ పురాణం వంటి ఇతర భారతీయ గ్రంథాల నుండి పాక్షికంగా స్వీకరించబడ్డాయి. [3][5]భవిష్య పురాణాల్లోని మరింత నిజం, ప్రామాణికత గురించి ఆధునిక మేధావుల ద్వారా ప్రశ్నించబడింది. హిందూ సాహిత్యపు పౌరాణిక శైలి యొక్క “స్థిరమైన పునర్విమర్శలు , జీవన స్వభావానికి” ఈ పురాణ వచనం పరిగణించబడుతుంది.
     
         భవిష్య పురాణం వేద వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో ఏకాదశ పురాణం. ఈ పురాణంలో మొత్తం 5 భాగాలున్నాయి. మొదటి భాగంలో విష్ణువు, శివుడు, సూర్య భగవానుని జననం వర్ణించ బడింది. రెండవ, మూడవ, నాల్గవ భాగాలలో ఆ దేవతల గొప్పతనం వర్ణించ బడింది. ఐదవ భాగంలో స్వర్గలోక వర్ణన ఉంది.
  • Sri Brahma Puranam in telugu

    300.00

     శ్రీ బ్రహ్మ మహా పురాణం

  • Sri Brahmanda Puranam in telugu

    300.00

    శ్రీ బ్రహ్మాండ మహా పురాణము

    By అవాంఛ సత్యనారాయణ

    Pages : 504

  • Sri Kurma Puranam in telugu

    225.00
    కూర్మ పురాణము
     
         అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీ కూర్మ మహాపురాణం. ఇది మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం.. “కూర్మం పృష్ఠం సమాఖ్యాతం” అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్థం అనే రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వార్థంలో 53 అధ్యాయాలు ఉండగా, ఉత్తరార్థంలో 44 అధ్యాయాలున్నాయి. కూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది. ప్రస్తుతం ఉన్న ప్రతిలో 6,000 శ్లోకాలు ఉన్నాయి.
     
         ప్రాంతీయ రాతప్రతుల్లో అధ్యాయాల సంఖ్య మారుతూ ఉంటుంది, కుర్మ పురాణం యొక్క క్లిష్టమైన ఎడిషన్‌లో 95 అధ్యాయాలు ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారం కుర్మ పురాణ గ్రంథంలో 17,000 శ్లోకాలు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న రాతప్రతిలో 6,000 శ్లోకాలు ఉన్నాయి.
  • Sri Linga puranamu in telugu

    360.00

    శ్రీ లింగ పురాణము

        లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది.
     
    దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది.
  • Sri Matsya Puranam in telugu

    500.00

    శ్రీ మత్స్య మహా పురాణం

  • Sri Narada puranam in telugu

    799.00

    శ్రీ నారద పురాణం

    వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి, కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగుతుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది.

  • Sri Padma Puranamu 1

    495.00

    శ్రీ పద్మ మహాపురాణము 1

    పద్మ పురాణం  హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.