Shop
Showing 1513–1524 of 2376 results
-
-
-
-
-
-
-
-
Siddhanta Shiromani in Telugu
₹1,350.00సిద్ధాంత శిరోమణి
1,232 Pages
గణితాధ్యాయం, గోళాధ్యాయం
గణితాధ్యాయం, గోళాధ్యాయం, జ్యోతిష గ్రంథం.
ఇది సుమారు 900 శ్లోకాలతో కూడి ఉన్నది -
-
-
Sindhu Nadi Pushkaralu 2021
మన దేశం లో లేని సింధు నదికి పుష్కర స్నానాలు ఎక్కడ చేయాలి…సింధు నది గంగా నదిలోని ఒక పాయ. పూర్వము భగీరథుని తపస్సుకు మెచ్చి, గంగ భూలోకానికి, శివుని శిరస్సు మీదుగా దిగి వచ్చింది. శివుడు తన జటాజూటంలోని గంగను, కొంచెంగా బిందు సరోవరంలో విడిచిపెట్టాడు. అక్కడనుండి గంగ ఏడు పాయలై ప్రవహించింది. పావని, హ్లాదిని, నళిని అనే మూడు పాయలు తూర్పుగాను, సీత, సుచక్షువు, సింధువు అనే మూడు పాయలు పడమటగా ప్రవహించాయి. ఏడవ పాయ గంగగా భగీరథుని వెంట వెళ్లింది. ఈ విధంగా శివుని జటాజూటం నుండి పుట్టిన ఈ సింధు నది సాక్షాత్తు గంగా స్వరూపమే. ఈ నది రెండవ రూపం ధరించి వరుణుని సభలో ఉండి, ఆయనను ఉపాసిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ నదికి పుష్పభద్ర అని మరియొక పేరు కూడ ఉంది.ఈ నదీ తీరంలో ఒకప్పుడు మార్కండేయ మహర్షి కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆయన తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తపస్సును విరమించ లేదు. చివరకు నరనారాయణులు ఆయనకు ప్రత్యక్షమైనారు. అప్పుడు మార్కండేయుడు ఈ నదీ జలాలతో ఆ స్వామి పాదాలు కడిగాడు. ఆ నీరు తిరిగి నదిలో కలిసింది. విష్ణు పాదాల నుండి పుట్టిన గంగలో ఒక భాగమైన సింధు జలాలు తిరిగి ఆ స్వామి పాదాలే కడిగి, సింధూ నదీ జలాలలో కలిసి పోయింది. అందువల్లనే సింధు గంగ కంటే శ్రేష్ఠమైన నదిగా ప్రసిద్ధికెక్కింది.ఆ తరువాత మార్కండేయుడు మఱ్ఱి ఆకుపై శయనించిన శ్రీమన్నారాయణుని, ప్రపంచ ప్రళయ కాలమును దర్శనం చేసుకొన్నాడు. ఆ సమయంలో స్వామి శరీరంలో సకల లోకాలు మార్కండేయుడు చూడగలిగాడు. హిమాలయ పర్వతంతో పాటుగా ఈ సింధు నదిని గూడ స్వామిలో చూడగలిగాడు. . దీనిని బట్టి సింధు ఎంత పవిత్రమైన నదియో తేలుతున్నది. ఈ నదిలో నుండి అగ్ని పుట్టింది. అందుకే ఈ నదిని అగ్ని ఉత్పత్తి స్థానంగా పేర్కొన్నారు. ఈ సింధు పేరు మీదుగానే భారతదేశానికి హిందూ దేశమని పేరు వచ్చింది. సింధు శబ్దాన్ని హిందూ అని పలకడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ సింధు నదీ తీరంలోని సామ్రాజ్యాన్ని సింధు దేశమని పిలిచేవారు. మహాభారత కాలంలో కౌరవుల చెల్లెలు దుస్సల భర్త జయద్రదుడు ఈ సింధు దేశపు రాజే. అందుకే అతనిని సైంధవుడు అని కూడ అంటారు. ఇంతటి పవిత్ర నది 1947లో భారతదేశమువిభజించబడినప్పుడు, పాకిస్థాన్ లోకి వెళ్లి పోయింది.అందువల్ల పుష్కర స్నానం చెయ్యడానికి, అవకాశం లేని దానికి పెద్దలు మార్గాంతరాన్ని సూచించారు. దాని ప్రకారము, కాశీకి గాని, హరిద్వార్ గాని వెళ్లి గంగా నదిలో, సింధు నదీ పుష్కర సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే, సింధుగూడ గంగ లోని ఒక పాయే గాబట్టి ఆ పుణ్యం వారికి లభిస్తుంది.21st నవoబర్ 2021 నుండి dec 02 2021 వరకు..కాశీ వెళ్ళండి మీ భరద్వాజ్ శర్మ phd in astrology
Send Your Messages Only 











