Subrahmanyaaradhana

సుబ్రహ్మణ్యారాదన
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

120.00

మరిన్ని Telugu Books కై
,
Tag:
Share Now

Description

సుబ్రహ్మణ్యారాదన
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

స్కంద పంచమి

స్కందుడు దేవసేనాధిపత్యం పొందిన ఆషాఢ శుద్ధ షష్ఠికి ముందురోజు స్కంద వ్రతాచరణాన్ని శాస్త్రాలు ఉపదేశించాయి. అదే స్కంద పంచమి. మరునాటి షష్ఠిని కుమార షష్ఠిగా వ్యవహరిస్తారు. శివ కుమారుడైన కుమారస్వామికి స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు అని నామాంతరాలున్నాయి.
కుమారస్వామి గురించి పురాణాల్లో భిన్నగాథలు ఉన్నాయి.
    బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శివపార్వతులు నర్మదాతీరంలో మన్మథక్రీడలో ఉండగా, తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం జరగ్గా, భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదలగా, గంగ రెల్లుపొదల్లో జారవిడిచిందని పురాణాల కథనం. శరవనంలో జన్మించినవాడు శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు మునిపత్నులు ఆ శిశువును బదరికావనం తీసుకుపోయారు. కృత్తికలు పెంచినవాడు కనుక కార్తికేయుడయ్యాడు.
   బ్రహ్మపురాణంలో సనత్కుమారుడి వృత్తాంతం ఉంది. బ్రహ్మ మానస పుత్రుడు, పరమ వైరాగ్యమూర్తి అయిన సనత్కుమారుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది. ఊహాలోకమే వద్దనుకునేవాడికి ఈ కల ఏమిటని సనత్కుమారుడు బ్రహ్మనడిగాడు. అది రాబోయే జన్మలోనిదన్నాడు బ్రహ్మ. ఈ విషయం శివపార్వతులకు తెలిసి సనత్కుమారుడంతటివాడికి మరో జన్మ ఉంటే అతడు తమకు సంతానమైతే బాగుంటుందని అభిప్రాయపడతారు.
    తపో నిమగ్నుడైన సనత్కుమారుడి వద్దకు శివుడు వెళ్లి పలకరిస్తే, అతడు మాట్లాడలేదు. శివుడు ఆగ్రహించి శపించగలనని హెచ్చరిస్తాడు. కళ్లు తెరిచిన సనత్కుమారుడు శాపఫలితం తన దేహానికేగాని ఆత్మకు కాదంటాడు. శపిస్తానన్నా భయపడని సనత్కుమారుణ్ని చూసి ఆశ్చర్యపోయిన శివుడు వరం కోరుకొమ్మన్నాడంటారు. దానికి అతడు- ‘ప్రపంచంమీద ఏ ఆశలేని నాకు వరం దేనికి, కావలిస్తే నీకే ఇస్తాను కోరుకొ’మ్మని చెప్పాడు. ఈ అవకాశం జారవిడుచుకోరాదని శివుడు అతణ్ని తనకు పుత్రుడిగా పుట్టాలని అడుగుతాడు. అడిగింది శివుడు గనుక సనత్కుమారుడు శివుడి గర్భంలో ఒక నిప్పుముద్దగా ప్రవేశించాడు. అది శివుడి మూడోకంటి నుంచి శరవణంలో పడి కుమార రూపం ధరించింది.
కృత్తికాస్త్రీలు తమ స్తన్యంతో పోషించారు.
స్కందుడు శూరపద్మాసురుణ్ని, తారకాసురుణ్ని, అంధకాసురుణ్ని సంహరించాడు.
   సుబ్రహ్మణ్యుడి వాహనం నెమలి. నెమలి నర్తనం ఓంకార రూపం. అతడు ప్రణవ రూపుడు. కోడిపుంజు అతడి ధ్వజం. ‘కో’ ధ్వని జ్ఞానభానూదయానికి సంకేతం. స్కందుడి చేతిలోని ఆయుధం- ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల రూపం. దక్షిణ భారతదేశంలో స్కందపూజకు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సామర్లకోట వద్ద స్కందారామంలోని శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఇది పంచారామాల్లో ఒకటి. – డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. కుక్కే సుబ్రమణ్య – నాగదేవత నివసించే ప్రదేశం….,!!
నాగదోష పరిహారం చేయించుకోవాలను కుంటున్నారా?!. మీ అనుకూలాన్ని బట్టి ఈ ఆలయాన్ని సందర్శించండి. మహిమాన్విత మైన శ్రీ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్నీ పొందండిక.కుక్కే శ్రీ సుబ్రమణ్యేస్వామి వారి గుడి నాగదోష పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రధానముగ సర్పహత్యదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగ ప్రతిష్ట పూజలు చాలా నిష్టగ నిర్వహిస్తారు. ఇక్కడ గుడిలో నాగదోష పరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి భాదలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖసంతోశాలతో జీవిస్తారు అని పురాణ గాధలలో ఉంది.

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊళ్ళో కుక్కే సుబ్రమణ్య దేవాలయం వుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ – ఇక్కడి క్షేత్ర గాధ కూడా యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది.
ఆలయ స్థలపురాణం

ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.

ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది. పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు. క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.

స్థలపురాణం : పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి (కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో) ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలసింది.

మరిన్ని వివరాలు :

సుబ్రహ్మణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి , మధ్యభాగంలో వాసుకి, కింద్రిభాగంలో ఆదిశేషు ఉంటారు.

ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ‘ఆది శంకరాచార్యులు’ తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ‘నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ’ అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం.

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం
కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మంగళూరు దగ్గరలోని విమానాశ్రయం. గుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ వుంది. బెంగళూరు, మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం వరకు చాలా ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో వున్నాయి.

కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటి లో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు. ముఖ్యంగా కుమార పర్వత౦ పరుచుకుని వుంటాయి. ఈ గుడి శివుడి రెండో కుమారుడు, కార్తికేయుడు గా పిలవబడే సుబ్రహ్మణ్య స్వామికి, నాగ రాజు వాసుకి కి నిలయం.

సుబ్రహ్మణ్య దేవాలయంలో బయట లోపల వున్న హాళ్ళు గర్భాలయానికి దారి తీస్తాయి. ఒక ఎత్తైన వేదిక మీద సుబ్రహ్మణ్య స్వామి తో పాటు వాసుకి విగ్రహాలు వున్నాయి. హిందూ పురాణాల ప్రకారం మరో నాగ రాజు ఆది శేషుడి విగ్రహం కూడా గర్భాలయం లో చూడవచ్చు. గర్భాలయానికి, మండప ద్వారానికి మధ్య వెండి తో కప్పబడిన గరుడ స్థంభం వుంది. స్థానికుల ప్రకారం యాత్రికులను ఈ స్తంభంలో నివసించే వాసుకి నుంచి వచ్చే విషం నుంచి కాపాడడానికి ఈ స్తంభానికి తాపడం చేశారు.

సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు అనేకమంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు.
ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ‘ఆది శంకరాచార్యులు’ తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ‘నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ’ అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం…. దైవానుగ్రహప్రాప్తిరస్తు